Monday, 29 February 2016

ద్వాదశ రాశులకూ లక్ష్మీ మంత్రములు

 ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపించాలో దిగువున ఇస్తున్నాం . ఆ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని పూర్వుల వాక్కు వీటిని గురువుల ద్వారా గాని , పెద్దలద్వారా గాని ఉపదేశం పొంది జపించాలి.

1. మేషం                               ఓం ఐం క్లీం సౌః
2. వృషభం                             ఓం ఐం క్లీం శ్రీం
3. మిథునం                           ఓం క్లీం ఐం సౌః
4. కర్కాటకం                          ఓం ఐం క్లీం శ్రీం
5. సింహం                              ఓం హ్రీం శ్రీం సౌః
6. కన్య                                  ఓం శ్రీం ఐం సౌః
7. తుల                                 ఓం హ్రీం క్లీం శ్రీం
8. వృశ్చికం                            ఓం ఐం క్లీం సౌః
9. ధనుస్సు                           ఓం హ్రీం క్లీం సౌః
10. మకరం                              ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌః
11. కుంభం                               ఓం హ్రీం ఐం క్లీం శ్రీం
12. మీనం                                ఓం హ్రీం క్లీం సౌః

ఐం - మంచి విద్యకు, మాట కారితనమునకు.
క్లీం -  కోర్కెలు నెరవేరుటకు. సంపదలకు.
సౌః - ఇది సౌభాగ్యామునకు, ఆరోగ్యము, సకల కార్య విజయం పొందడానికి.
ఈ మూడు బీజములు సరస్వతీ, లక్షీ, పార్వతీ బీజములని అంటారు.
శ్రీం - అమ్మ వారికి చెందిన మంత్రం సంపదలకు, సకల అభీష్టసిద్ధి కలుగుటకు.
హ్రీం - సూర్యబీజము. వ్యాధులు నశించును.

మహా శక్తిగల ఈ మంత్రాలను మన మహర్షులు , అమోఘ తపశ్శక్తితో దేవతలను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.' ఓం, ఐం, క్లీం, హ్రీం, శ్రీం, సౌః
 అనే ఏకాక్షర బీజ మంత్రాలు శక్తివంతమైన మహామంత్రాలలవడానికి ఆయా దేవతల బీజాక్షరాలన్ని  కలిపి జపించాలి.

No comments:

Post a Comment